- Advertisement -
గ్రామ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ఉష
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పంచాయతీ ఆవరణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేడుకలకు హాజరైన గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామ పెద్దలకు గ్రామస్తుల అందరికీ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి స్వీట్లు పండ్లు ఫలాలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, పంచాయితీ అధికారులు, సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



