- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు హమాలి సంఘం, మాయాబజార్ హమాలి సంఘం ఆధ్వర్యంలో ( సీఐటీయూ ) గణతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సుభాష్ టాకీస్ వద్ద రెండు హమాలి సంఘాల కార్యాలయాల వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ( సీఐటీయూ ) జిల్లా అధ్యక్షులు కందరపు రాజనర్సు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కర్రల సత్యం, రెండు హమాలి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, హమాలి యూనియన్ నాయకులు సుమారు 100 మంది హమాలి సంఘం,సీఐటీయూ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



