- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో దోమల మందు పిచికారి చేయించాలని ఆర్టిఐ రవీందర్ బుధవారం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పిచ్చి మొక్కలు, నీటి గుంతలు ఎక్కువగా ఉన్నాయని నీరు నిలువ లేకుండా చూడాలని దోమల బెడద నుండి ప్రజలను కాపాడడానికి దోమల మందు పిచికారి చేయించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు శ్రీను, రాజు, శేఖర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -