నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో రోజురోజుకు కొత్త వాహనాలు పెరుగుతున్నందువలన ట్రాఫిక్ సమస్య పెరిగిందని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ.. పట్టణంలో రోజురోజుకు కొత్తా వాహనాలు పెరుగుతున్నాయని, పాత బస్టాండ్ నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందని అన్నారు. కొత్త బస్టాండ్ వద్ద ప్రయాణికులు ఆటోలు దిగుతున్న సందర్భంగా ట్రాఫిక్ పెరుగుతోందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులను అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఒక రు, బస్టాండ్ దగ్గర ఒకరు, మామిడిపల్లి చౌరస్తా దగ్గర ఒకరిని, పెట్టాలని అన్నారు.
స్కూలు ప్రారంభమైనందువల్ల డివిజన్లోని ప్రజలంతా ఆర్మూర్ కు మార్కెటు చేయటానికి వస్తుంటారు పోతుంటారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినందువల్ల ట్రాఫిక్ నియంత్రణ చేయాలని అన్నారు. ఆర్మూరు మార్కెట్ లో ప్రతి బుధవారం జరుగుతున్నప్పటికీ వాహనాలు వెళ్ళటం వల్ల మార్కెట్లో ట్రాఫిక్ సమస్య బాగా పెరుగుతున్నందువల్ల మున్సిపల్ కార్యాలయం ముందు భారీకేట్లు ఏర్పాటు చేయాలని తెలపడం జరిగింది. వెంటనే ఏసీపి ట్రాఫిక్ నియంత్రణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు, పట్టణంతోపాటు రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పోలీస్ల సంఖ్య పెంచాలని పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని అన్నారు .ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు నవీన్, కుల్దీప్ శర్మ సూరి తదితరులు పాల్గొన్నారు.