- Advertisement -
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో పెద్ద చెరువు ను గ్రామ పంచాయతీ కీ అప్పగించాలని గ్రామస్థులు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు వినతి పత్రం ను బుధవారం అందజేశారు. ఈ చెరువు మత్స్యకార సొసైటీ నుండి మీనయించాలని గ్రామస్తుల కోరారు. సొసైటీ పరిధిలో చెరువు ఉండడంతో ఆయకట్టు రైతులకు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని , గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యేకు తెలియజేశారు. తక్షణమే సొసైటీ నుండి చెరువును గ్రామపంచాయతీ కీ అప్పగించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో గ్రామస్థులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



