- Advertisement -
నవతెలంగాణ- కుభీర్ : ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూడలని మండల విద్య అధికారి విజయ్ కుమార్ కు బుధువారం దొడర్నా గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ .. ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రగానామాలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంటి స్థలాలు కేటాయించి విక్రయిస్తున్నారని అన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఇందుకు ఎంఈఓ సానుకూలంగా స్పందించి, త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని గ్రామస్తులకు తెలిపారు.
- Advertisement -