నవతెలంగాణ – భిక్కనూర్
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి శుక్రవారం మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కిష్టా గౌడ్ మాట్లాడుతూ వంట కార్మికులకు రావాల్సిన 9 నెలల గుడ్ల బిల్లులు, 4 నెలల 3వేల రూపాయల జీతం పెండింగ్లో ఉన్నయని దాదాపు కామారెడ్డి జిల్లాలోని 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు చేయించి మధ్యాహ్న భోజన వంట కార్మికులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.
మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES