నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 386లో ఉన్న వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులకు రైతుబంధు ఇప్పించాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు రైతులతో కలిసి వినతిపత్రం అందజేసినట్లు బిఆర్ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్ మంగళవారం తెలిపారు. సర్వే నంబర్ 386లో ఎన్నో సంవత్సరాల నుండి ఎంతోమంది రైతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని ఆయన తెలిపారు. గత రెండు దపాల నుండి రైతు బంధు డబ్బులు రావడం లేదన్నారు. గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉన్న కూడా రైతుబంధు రావడంలేదని, తమ సమస్యను పరిష్కరించి రైతులందరికీ రైతుబంధు ఇప్పించాలని ప్రజావాణిలో అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నట్టు రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో రైతులు బద్దం రాజశేఖర్, నూకల బుచ్చి మల్లయ్య, పెంట కిషన్, రాజేశ్వర్, పెంట పురుషోత్తం, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు ఇప్పించాలని వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



