Monday, June 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపోతంగల్ గ్రామానికి బస్సు సర్వీసులు పునరుద్దరించండి

పోతంగల్ గ్రామానికి బస్సు సర్వీసులు పునరుద్దరించండి

- Advertisement -

పోతంగల్ గ్రామ ప్రజలు డిమాండ్ ..
నవతెలంగాణ – గాంధారి 
: గత 20 సంవత్సరాలుగా గాంధారి మండలంలోని పెద్ద పోతంగల్ గ్రామానికి కామారెడ్డి డిపో బస్సులు, బాన్సువాడ డిపో బస్సులు గ్రామంలోకి వచ్చి బాన్సువాడ గాంధారి మీదుగా కామారెడ్డి బస్సు సర్వీసులు నడిచేవి. ఇవి గ్రామస్తులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడేవి. ఏమైందో ఏమో కానీ గత నెల రోజులుగా గ్రామంలోకి బస్సులు రావడం బంద్ కావడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోకి బస్సులు రాకపోవడంతో ప్రయివేట్ వాహనదారులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు గత 20 సంవత్సరాలుగా రాత్రి 8 గంటలకు  కామారెడ్డి నుండి బయలుదేరి  వయా  పోతంగల్ కలాన్ గ్రామంలోకి వచ్చి 10 నుండి 15 మంది ప్రయాణికులని దింపి బాన్సువాడకు వెళ్ళేది. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 9 గంటలకు బస్సు సర్వీసులు నడిచేవి. గత నెల రోజుల నుండి ఆ బస్సు రావడం లేదు. కావున యధావిధిగా ఆ బస్సు సర్వీసులను గ్రామంలోకి నడపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో ప్రారంభమైతున్న సమయంలో బస్సు సర్వీసులు బందు చేయడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రారంభం లోపు బస్సు సర్వీసులు ప్రారంభించకుంటే కామారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారి పెద్ద పోతంగల్ కాలన్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వీడీసీ సభ్యులు, గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -