- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వందమంది లబ్ధిదారుల ఫైనల్ జాబితాపై అధికారులు రీ సర్వే చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కాంత్రి కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ శ్రీజ, పీఆర్ ఏఈ రవీందర్ టీఎంలుగా రెండు రోజులుగా లబ్ధిదారుల నివాసలకు వెళ్లి వారి స్థితిగతి వివరాలను సేకరించారు .ప్రస్తుతం ఉంటున్న ఇళ్లను పరిశీలించి,లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నివేదక ఆధారంగానే లబ్దిదారులకు త్వరలోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అనుమతి పత్రాలు రానున్నాయని తెలిపారు.
- Advertisement -



