– హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి
నవతెలంగాణ-కాజీపేట
కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదనీ, తనపై ఎన్ని కేసులు పెడితే అంత బలంగా తయారవుతానని, రేవంత్ రెడ్డితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల బాగోతాలు బయట పెడతానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో కౌశిక్రెడ్డిని అరెస్టు చేయగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చివరికి న్యాయమే గెలిచిందని అన్నారు. ఆయన వెంట మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
రేవంత్రెడ్డి, కాంగ్రెస్ బాగోతం బయట పెడతా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES