- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: నగరంలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో రెండో కేంద్రంగా దీన్ని నెలకొల్పారు. ప్రపంచంలో ఇది నాలుగో సెంటర్ కావడం విశేషం. ఏషియా పసిఫిక్ రీజియన్లో సురక్షిత డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేయనుంది. దీంతో ఐటీ రంగంలో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు పాల్గొన్నారు.

- Advertisement -