బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ : రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఈ విధంగా పరిశీలిస్తున్నారన్న విషయం పై అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా సదస్సు లో వచ్చిన బాబుల్ గావ్, బూర్గుపల్లి, కాటేపల్లి గ్రామాల్లో వచ్చిన బల్క్ దరఖాస్తులను తీసుకున్న పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆలా కాకుండా సింగిల్ గా ప్రతి ఒక్కరైతు దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవాలి సూచించారు. రెండు నెలల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ దశరథ్,నాయబ్ తహసీల్దార్ రవి కాంత్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాలొగొన్నారు.
రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES