- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని మోషన్ పూర్ లో గురువారం తెలంగాణ ప్రభుత్వం రైతు భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రెవెన్యూ సదస్సును తహసిల్దార్ ఉమలత ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులు భూ సమస్యలపై 61 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ కిష్టయ్య, ఆర్ ఐ రవికాంత్, సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శీలసాగర్, కాంగ్రెస్ నాయకులు గున్నాల కిషన్ గౌడ్, రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -