Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు 

భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు 

- Advertisement -

ఇంచార్జ్ తహసిల్దార్ సురేష్ బాబు 
నవతెలంగాణ – తాడ్వాయి 
: భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు అన్నారు. మండలంలో మంగళవారం కాటాపూర్, ఊరట్టం గ్రామాల్లోని పంచాయితీ కార్యాలయాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు రైతుల నుంచి భూ సమస్యలు, పాస్ బుక్కు సమస్యలు, రీ సర్వే, ముటేషన్ కు సంబంధించిన తదితర అంశాలపై పలువురు రైతులు నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తాసిల్దార్ సురేష్ బాబు, మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కోసం గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు సందేహాలను సదస్సుల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలను చేసారు. డాక్యుమెంట్లు లేనివారు మరియు పూర్వం తప్పులు పడిన వాటికి సంబంధించినవి సరిచేసు కోవాలిని తెలిపారు. రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తొందరగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని పట్టాదారు, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఐ లు డేగల సాంబయ్య, సునీల్, జూనియర్ అసిస్టెంట్లు స్వామి, నాలి నాగేష్, వినోద్, ధరణి ఆపరేటర్ రాము, సబ్బార్డినేట్ చెట్టుపల్లి బిక్షపతి సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వీఆర్ఏ లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -