Wednesday, June 4, 2025
E-PAPER
Homeఖమ్మం3 నుంచి 20 వరకు రెవిన్యూ సదస్సులు: తహశీల్దార్ రామక్రిష్ణ

3 నుంచి 20 వరకు రెవిన్యూ సదస్సులు: తహశీల్దార్ రామక్రిష్ణ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఈ నెల 3 వ తేదీ మంగళవారం నుండి 20 వ తేది వరకు భూ భారతి చట్టం ప్రకారం రెవిన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ రామక్రిష్ణ సోమవారం తెలిపారు. 19 రెవిన్యూ గ్రామాల పరిధిలోని 27 పంచాయితీలు,అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలో రెండు బృందాలుగా ఈ రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఒకటో బృందానికి తహశీల్దార్ గా నేను,బృందం సభ్యులుగా ఆర్ఐ లు పద్మావతి,క్రిష్ణ,ఎస్.ఏ లక్ష్మయ్య,ఆర్.ఏ శ్రీశైలం,చైన్ మేన్ సన్యాసి ఉంటారని అన్నారు. రెండో బృందంలో ఎలక్షన్ డీటీ హుస్సేన్,ఆర్ఐ లు పద్మావతి,క్రిష్ణ లు,ఎస్.ఏ చైతన్య,ఆర్ఏ రమేష్,టైపిస్ట్ వెంకన్న వ్యవహరిస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -