ఎమ్మార్వో మహేందర్ కుమార్. .
నవతెలంగాణ – జుక్కల్ : నేటి నుంచి జుక్కల్ మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు అవగాహన కార్యక్రమం ఉంటుందని ఎమ్మార్వో మహేందర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3 నుండి 20వ తేదీ వరకు 17 రోజులపాటు ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో తో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న గ్రామాలలోని ప్రజలు ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులో పాల్గొనాలని సూచించారు . గ్రామ రెవెన్యూ సదస్సులు ఉన్నప్పుడు ఇతర కార్యక్రమాలు, భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ విషయాన్ని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని, గమనించగలరని అన్నారు. కావున ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎంఆర్ఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో తో పాటు నయాబ్ తాహసిల్దార్ హేమలత , ఆర్ఐ రామ్ పటేల్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES