- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక : భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పలువురు రైతుల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, పలువురున్నారు.
- Advertisement -