- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన,ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంపై భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి బాపు రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపిడిఓ క్రాoతి కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవి కుమార్, వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -



