- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. పోలీసులే బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మహిళలు, పిల్లలపై నేరాలు, పోక్సో, బాల్యవివాహాలు, శారీరక దాడులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధకచట్టం వంటి కేసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు సీఐడీ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -



