Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత ..

మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత ..

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి: మండలంలోని బీరెల్లీ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బేత నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా దశదినకర్మకు శనివారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్బంగా బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనువాస్, మాజీ ఎంపిటిసి ఇర్సవడ్ల భవాని నారాయణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం, నగదు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బేత నర్సమ్మ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగరి సదయ్య, దాయ వెంకటేశ్వర్లు, అయిదులిపురం కోటి, అల్లం సాంబశివరావు, ప్రశాంత్, లచ్చులు, నారాయణ, మెంతిని బాబు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad