- Advertisement -
దుబాయ్ : భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ బ్యాటింగ్ రేటింగ్లో 62 పాయింట్లు మెరుగయ్యాడు. ఇంగ్లాండ్పై లీడ్స్ టెస్టులో 134, 118 పరుగులతో రెండు సెంచరీలు సాధించిన రిషబ్ పంత్ ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగై ఏడో స్థానానికి చేరుకున్నాడు. లీడ్స్ టెస్టుకు ముందు పంత్ బ్యాటింగ్ రేటింగ్ పాయింట్లు 739. వరుస సెంచరీలతో పంత్ రేటింగ్ పాయింట్లు 801కు చేరాయి. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ (62, 149) సైతం ర్యాంకింగ్స్లో ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (851) నాల్గో స్థానంలో నిలువగా.. జో రూట్, హ్యారీ బ్రూక్ టాప్-2లో కొనసాగుతున్నారు.
- Advertisement -