Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉరేసుకుని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య..

ఉరేసుకుని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జుక్కల్ మండలంలోని  మహమ్మాదాబాద్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై నవీన్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మోరే గణేష్ (38) వేల్పూరు మండలం నిజామాబాద్ జిల్లా చెందిన వ్యక్తి. ఇతను గత 20 ఏళ్ల క్రితం మహమదాబాద్ గ్రామానికి వచ్చి ఇక్కడే ఆర్ఎంపీ వైద్యుడుగా వృత్తి చేస్తున్నాడు. 19 సంవత్సరాల క్రితం మోరే గౌరీ (35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పెద్దకొడుకు ఎం .శివరాం (17), ఇంటర్ బోధన్ లో, చిన్నకొడుకు ఈశ్వర్(16) ఇంటర్ హైదరాబాదులో చదువుతున్నాడు.

అయితే జూలై 13న గణష్ కు భార్యతో కొంత ఘర్షణ జరిగింది. దీంతో భార్య హైదరాబాదులో ఉన్న చిన్న కొడుకుకు ఫోన్ చేసి, తల్లి గ్రామానికి పిలిపించుకుంది. అనంతరం ఇద్దరూ కలిసి భోధన్ లోని పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లారు. అక్కడ్నించి భార్య గణేష్ కు మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంది. అయితే ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో .. గణేష్ మిత్రుడైన దేవిదాస్ కు సమాచారం అందించి, జరిగిన విషయమంతా చెప్పారు. అప్పమత్తమైన దేవిదాస్ గణేష్ ఇంటికి వెళ్లి తలుపులను గట్టిగా నెట్టి చేశాడు. అయితే అప్పటికే గణేష్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని విగతజీవిగా పడి ఉన్నాడు. అది చూసిన దేవిదాస్ ఎంతో భాదపడుతూ.. గణేష్ భార్యా పిల్లలకు తన మిత్రుడి మరణ వార్తను తెలిపాడు. సమాచారం అందుకున్న ఎస్సై పంచినామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని తెలిపాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -