నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి కామారెడ్డి పట్టణంలోని లయోలా హైస్కూల్లో కామారెడ్డి పోలీసులు మంగళవారం కళాబృందం ఆధ్వర్యంలో సి టీమ్స్ సైబర్ నేరాలు మాదకద్రవ్యాలు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ యం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే కామారెడ్డి టౌన్ సబ్ – ఇన్స్పెక్టర్ రాజారామ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై కానిస్టేబుల్. ప్రవీణ్ మాట్లాడుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్.1930 ఫోన్ చేయాలన్నారు. కామారెడ్డి షి టీమ్స్ సభ్యులు మహిళా కానిస్టేబుల్, సౌజన్య, కానిస్టేబుళ్లు భూమయ్య, భాను లు అవగాహనా కల్పిస్తూ ఫోన్ నెంబర్ 8712686094 అత్యవసర సమయంలో, 100 కాల్ చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్,మాదకద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టొద్దని, మానవ అక్రమ రవాణపై మహిళలు చిన్న పిల్లలపై జరుగు హత్య నేరాలుపై బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలపట్ల బరోసా టీమ్ అవగాహన కల్పించారు.
యువతి, యువకులు తల్లి తండ్రుల మాట వినాలని వారిని గౌరవించాలని సేల్ ఫోన్స్ యూట్యూబ్.ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్,రామంచ తిరుపతి, యు, శేషారావు, పోలీస్ కానిస్టేబుల్. ప్రభాకర్, సాయిలు పాటలు, మాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ సబ్ – ఇన్స్పెక్టర్ రాజారామ్, మహిలా బ్లూకోట్స్ లేయోలా ప్రిన్సిపాల్ , వీరచారీ, డైరెక్టర్ ఫహీమ్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES