నవతెలంగాణ – -హైదరాబాద్: జగిత్యాల రోడ్డు ప్రమాదంలో హనుమాన్ మాల ధారుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..టీఆర్ నగర్కు చెందిన కొడిక్యాల కృష్ణమూర్తి అనే వ్యక్తి పట్టణ కేంద్రంలోని నటరాజ్ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుండి హనుమకొండ వెళుతున్న ఆర్టీసీ కింద బైక్ అదుపు తప్పి పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన కృష్ణమూర్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది.
- Advertisement -