- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణాలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో ఏఎంవిఐ రఫీ, ఇర్షాద్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనాథ్, రేణు కుమార్, అశోక్ యాదవ్, రాజు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



