- Advertisement -
నవతెలంగాణ- బిచ్కుంద
రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని బిచ్కుంద ఎస్సై రాజు అన్నారు. సోమవారం బిచ్కుంద మండలంలోని దడ్గి చౌరస్తాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన రోడ్డు భద్రత విషయాలు రోడ్డు సేఫ్టీ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తామని విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులుకు ఏస్ ఏ కాంపిటీషన్ పరిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



