- Advertisement -
నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం, మద్దిమల్ల గ్రామంలో చందనపు బ్రహ్మయ్య , చందనపు రాజేశం అనే అన్నదమ్ముల ఇళ్లలో సోమ వారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎస్సై లక్ష్మణ్ వెల్లడించారు. తాళం వేసి ఉన్న ఈ రెండు ఇళ్ల నుంచి దొంగలు రూ. 30 వేల నగదు, తొమ్మిది గ్రాముల బంగారం, మరియు 55 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై వేముల లక్ష్మన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -