Thursday, December 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలురూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ ఫండ్‌

రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ ఫండ్‌

- Advertisement -

కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్‌ఆర్‌ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అగ్ర కథానాయకుడు నాగార్జున హాజరై విద్యార్థులు, సిబ్బంది, హాజరైన వారందరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని అందించారు. ఏఎన్‌ఆర్‌ కళాశాల విద్యార్థుల కోసం ఏకంగా ఆయన రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ‘నా తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్‌ఆర్‌ కళాశాలలో రూ.2 కోట్లతో స్కాలర్‌షిప్‌ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిర్ణయం నాతోపాటు నా సోదరి సుశీల, సోదరుడు వెంకట్‌, మొత్తం ఏఎన్‌ఆర్‌ కుటుంబం కలిసి తీసుకున్నాం. ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్‌ఆర్‌ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్న ఈ సంస్థకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -