- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాగుడు సమీపంలో గల చెక్ పోస్ట్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో తీసుకువెళ్తున్న రూ.2 లక్షల పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల కు చెందిన ఆనందుల శ్రీనాథ్ అనే వ్యక్తి టి ఎస్ 21 5555 నెంబర్ గల కారు లో డబ్బులు తీసుకువెళ్తుండగా రగుడు సమీపంలో పోలీసులు వాహనం తనిఖీ చేశారు. తనిఖీలు రెండు లక్షల నగదు బయటపడ్డాయి. ఇలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు సిఐ కృష్ణ పేర్కొన్నారు.
- Advertisement -


