- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మదన్ పల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ గోవురి ఓడెన్న గ్రామంలోనూతనంగా నిర్మిస్తున్న నిలకంటేశ్వర ఆలయంలోని శివాలయ విగ్రహాలను, బొమ్మల ఏర్పాటుకు రూ. 5 లక్షల విరాళం గ్రామ కమిటీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనను అభినందించారు. ఒడ్డెన్నపై ఎప్పటికీ ఆ పరమశివుడు అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు టీ. నర్సయ్య, వెలుమల శ్రీనివాస్, లక్ష్మణ్, పిట్ల హనుమాడ్లు, దుంపటి గంగాధర్, చౌడ లక్ష్మణ్, దుంపటి సాయిలు, గ్రామ ప్రజలు త్డితరులు పాల్గొన్నారు.
- Advertisement -