Saturday, February 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 15 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 15 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా సదాశివపేట జాతీయ రహదారి 65పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -