ఇప్పుడున్న రెండు జేఏసీలు రద్దు
జులై 2న మరోసారి భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీజీఎస్ఆర్టీసీలో 11 కార్మిక సంఘాలతో ఒకే జేఏసీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో వేర్వేరుగా రెండు జేఏసీలు ఉన్న విషయం తెలిసిందే. ఒకే జేఏసీగా ఏర్పడేందుకు అనుకూలంగా గతంలోని రెండు జేఏసీలను రద్దు చేసుకుంటున్నట్టు ఆయా సంఘాల నేతలు ప్రకటించారు. మంగళవారం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అధ్యక్షతన 11 కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్), టీఎమ్యూ(అశ్వత్థామరెడ్డి), టీఎమ్ యూ (థామస్రెడ్డి), ఎస్డబ్ల్యూయూ, టీజేఎమ్యూ, ఎన్ఎమ్యూ, బీడబ్ల్యూయూ, బీకేయూ, కార్మిక సంఫ్ు, కార్మిక పరిషత్, ఎస్టీఎమ్యూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒకే జేఏసీగా ఏర్పడాలని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. జేఏసీ విధివిధానాలపై చర్చించేందుకు జులై 2వ తేదీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ఆర్టీసీలో 11 కార్మిక సంఘాలతో ఒకే జేఏసీ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES