- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్కు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు పాటు సెలవులు మంజూరు చేసింది. సజ్జనార్ సెలవుల్లో ఉండనున్న ఈ నెల రోజులు టీజీఎస్ఆర్టీసీ ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్గా రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే సజ్జనార్ 2021 నుండి టీజీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవుల్లో ఉండనున్నట్లు తెలిసింది.
- Advertisement -