- Advertisement -
– సీఎంను కలిసిన కమిషనర్లు
– 9న రవీంద్రభారతిలో సదస్సు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వారోత్సవాల లోగోను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం ఆర్టీఐ చీఫ్ కమిషనర్ సి చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాస్, ఎం. పర్వీన్, డి భూపాల్, వైష్ణవి తదితరులు సీఎంను కలిశారు. ఈనెల ఐదు నుంచి 12 వరకు ఆర్టీఐ వారోత్సవాలు రాష్ట్రంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎంతో ఆర్టీఐ కమిషనర్లు ఆయా అంశాలపై చర్చించారు. ఈనెల తొమ్మిదిన రవీంద్రభారతిలో ఆర్టీఐ సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం పాల్గొననున్నారు.
- Advertisement -