- Advertisement -
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ అధ్వాన్న స్థాయికి పడిపోయింది. పతనంలో మరో నూతన రికార్డ్ను చవి చూసింది. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో గురువారం డాలర్తో రూపాయి మారకం విలువ ఏకంగా 92.17 మార్క్కు పతనమయ్యింది. ఫారెక్స్ ఎక్సేంజీ మార్కెట్లో ఉదయం 92.25 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 92.36 కనిష్టానికి పతనం కాగా.. తుదకు 16 పైసలు కోల్పోయి 92.17 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో ఆందోళనలతో ఇప్పటికే దిగుమతులు భారం కాగా.. రూపాయి పతనం మరింత ఆందోళన కలిగిస్తోంది. రూపాయి విలువ క్షీణించడం ద్వారా దిగుమతి చెల్లింపులు మరింత భారం కానున్నాయి.
- Advertisement -



