- Advertisement -
మల్లారం గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
నవ తెలంగాణ – మల్హర్ రావు:- అనారోగ్యంతో మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు దువ్వాసి సుదర్శన్ (42) మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.సుదర్శన్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పేదల వైద్యుడు సుదర్శన్ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు తలలో నాలుకలా ఉంటూ నిరుపేదలకు వైద్యం అందించేవాడని కొనియాడారు.ఆయన అకాల మరణం గ్రామస్తులకు తీరని లోటని గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య తోపాటు పలువురు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.ఆధైర్య పడొద్దని కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు
- Advertisement -



