- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన అంకం రాజమణి స్పైనల్ స్టెనోసిస్ తో తీవ్ర సమస్యవల్ల హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్చారు. వైద్యానికి అయ్యే ఖర్చు వారి వద్ద లేకపోవడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతి రెడ్డిని కలిసి విషయం వివరించారు. వీరు నిరుపేదలు కావడంతో వైద్యం చేయించుకొవ డానికి డబ్బులు లేకపోవడంతో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రూ. 5లక్షల ఎల్ఓసిని శనివారం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -