Friday, June 27, 2025
E-PAPER
Homeఖమ్మంప్రజలు సందర్శించుకునేలా పల్లె ప్రకృతి వనాలు

ప్రజలు సందర్శించుకునేలా పల్లె ప్రకృతి వనాలు

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన ప్రారంభించాలి..
కార్యదర్శులకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదేశం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పంచాయితీల పరిధిలోని పల్లె ప్రకృతి వనాలు స్థానికులు సందర్శించేలా తయారు చేయాలని,ఇందిరమ్మ ఇండ్లు త్వరిత గతిన ప్రారంభించేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని పలు పంచాయితీల కార్యదర్శులకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఆయన గురువారం మండలంలోని వేదాంతపురం పంచాయతీ లోని పల్లె పకృతి వనాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శితో తనిఖీ చేసారు.

అందులో పిచ్చి మొక్కలు తీయించి వెంటనే ప్రజలు సందర్శించే విదంగా తయారు చేయాలని కార్యదర్శికి ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలలో అసాంఘిక కార్యక్రమాలు  జరగకుండా చూడాలని,అలాగే అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలని సూచించారు. నారం వారిగూడెం గ్రామ పెద్దల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు కు మార్కింగ్ ఇచ్చారు.పాత రెడ్డి గూడెం గ్రామ పంచాయతీ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -