Saturday, June 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుంతలతో నరకయాతన గ్రామీణ రోడ్లు..!

గుంతలతో నరకయాతన గ్రామీణ రోడ్లు..!

- Advertisement -
  • – భయం, భయంగా ప్రయాణం
    -రాత్రి వెళలో ఇంటికి చేరే వరకు లేని గ్యారంటీ..
    – గుంతల్లోపడి అవిటి వారవు తున్నా పట్టించుకోని అధికారులు
    -నవతెలంగాణ-పెద్దవూర

    ప్రజాపాల‌న‌లో గ్రామీణ రోడ్లు పూర్తిగా అధ్వాన్నంగా మారాయి. ఆ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజలు తమ రాకపోకలు సాగించడానికి ప్రత్యామ్నాయమైన రోడ్లు లేకపోవడంతో తప్పదన్నట్లుగా గుంతలమయంగా మారిన రోడ్ల వెంబడి ప్రయాణం చేయక తప్పడం లేదు. ఏ మాత్రం కనురెప్ప మూసిన వారి పని ఖతమేన్నట్లుగా రోడ్లు తయారైనాయి. బీటీ రోడ్లు గుంతలమయంగా మారడంతో మండలంలోని గ్రామీణ రోడ్లు కనిపిస్తున్నాయి. నాయినవానికుంట స్టేజీ నుంచి పర్వేదుల,జయరాం తండా 06 కిలోమీటర్ల రోడ్డు,పెద్దగూడెం స్టేజీ నుంచి కొత్తలూరు 08 కిలోమీటర్ల రోడ్డు,గర్నె కుంటనుంచి పెద్దవూర 06 కిలోమీటర్ల రోడ్డు,వెల్మ గూడెం నుంచి బసిరెడ్డిపల్లి 04,కిలోమీటర్ల రోడ్డు,బసిరెడ్డి పల్లి నుంచి కొత్తలూరు08 కిలోమీటర్ల రోడ్డు,పోతునూరు నుంచి పులిచర్ల 07 కిలోమీటర్ల రోడ్డు, బాసోని బావిస్టేజీ నుంచి ఉట్లపల్లి 04 కిలోమీటర్లు రోడ్డు, చింతపల్లి స్టేజీ నుంచి అల్వాల ఎక్స్ రోడ్డు 06 కిలోమీటర్లు,చలకుర్తి ఎక్స్ రోడ్డు నుంచి పర్వేదుల రోడ్డు ఇవన్నీ ప్రయానికులకు నరకం చూ పిస్తున్నాయి.ఈ గ్రామీణ రహదారులు బీటీ రోడ్ల పై చాలా మంది రైతులు బోర్లు వేసి,చెరువుల నుంచి మోటార్ల ద్వారా పైపు లైన్లు వేసి నీటిని తరలించే క్రమంలో బీటీ రోడ్ల ను తవ్వి పైపు లైన్లు వేసి వాటిని సక్రమంగా పూడ్చక పోవడం తో ఈ రహ దారుల పై
    ప్రతి ప్రతి కిలోమీటర్ కు 04 నుంచి 08 గుంతలు, గ్రామీణ రహదారులపై వందల సంఖ్యలో ఫీటు,లోతు గుంతలు,పెద్దగూడెం నుంచి కొత్తలూరు, నాయిన వాని కుంట స్టేజినుంచి పర్వేదుల,వెల్మ గూడెం నుంచి గర్నె కుంట రోడ్డు,పోతునూరు నుంచి పులిచర్ల రోడ్డు,పై ఫీటున్నర లోతు లో గుంటలు, నాయిన వాని కుంట అర్చీ నుంచి నాయిన వానికుంట తండా వరకు రెండు కిలోమీటర్లు దూరం రైతులు 13 పైపు లైన్లు వేసిన గుంతలు వున్నాయి. ఈ దారిలో చాలామంది వాహన దారులు కిందపడి కాళ్లు,చేతులు,విరిగినవారు,తలకు గాయాలై ఆసుపత్రి లో చికిత్స పొందిన వాళ్లు వంద మందికి పైగా ఉన్నారు.రైతులుకానీ, ఇంకేవరైన కానీ వేసిన బీటీ రోడ్డు కానీ,సీసీ రోడ్డు కాని తవ్వి పైపు లైన్లు వేయాలంటే సంభంధిత ఆర్ అండ్ భీ,పంచాయతీ రాజ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది కాని ఎలాంటి అనుమతి లేకుండా అడ్డగోలుగా రోడ్ల ను తవ్వి గుంటలు పూడ్చ కుంట వదిలేశారు.
    దాంతో ఈ రోడ్లు పూర్తిగా దయనీయ పరిస్థితిలో మారి ప్రమాదాలకు సాంకేతలుగా మారాయి. అంతకుముందే ప్రమాదకరంగా వున్న రోడ్లు వర్షాకాలం గుంతల్లో మట్టి కోట్టుక పోయి మరింత ప్రమాద కరంగా మారాయి.దీంతో ఈ రోడ్ల పై రాత్రి వెళలో ఇంటికి వెళ్లే వరకు గ్యారంటీ లేకుండా పోయింది.పూర్తిగా గుంతలుగా ఏర్పడి ప్రయాణికులు పడరానిపాట్లు పడుతున్నారు. ఎంత అప్రమత్తంగా వెళ్లిన ఈ గుంతలవద్ద రోజు ఎవరో ఒకరు ఎదో ఒకచోట వాహనాలు నడిపితే ప్రాణాలు పోవడం కాని లేదా అవిటివారు అవుతున్నారు. కనిపిస్తుంది. గుంతల రోడ్లతో ఇప్పటికే చాలా వరకు ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి దుస్థితి ఉంటే ప్రజాప్రతినిధులు ఎవరు కూడ ప్రజలు బాధలను పట్టించుకునే నాథుడే లేరు. ప్రజాపాలన ఏ ప్రజాప్రతినిధికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైన ప్రజలు పడుతున్న బాధలను అధికారులు, ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని వర్షాకాలం ప్రారంభం అయింది కాబట్టి సంబందిత, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ప్రత్యేక అధికారులు కాని స్పందించి గుంటలు పూడ్చి ప్రమాదాలు జరుగకుండా గ్రామీణ రోడ్లు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -