- Advertisement -
నవతెలంగాణ – ముధోల్:
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాండా లో సమ్మక్క సారలమ్మ ఆలయం భూములను కాపాడాలని ఎడ్ బిడ్ తాండా గ్రామస్థులు సోమవారం తహశీల్దార్ శ్రీలత కు వినతి పత్రం అందజేశారు. ఆలయ భూమిని అక్రమంగా పట్టా చేసుకుని,సాగుచేసుకుంటున్నరని వారు ఆరోపించారు. ఈ ఆలయ భూమిని కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -