- Advertisement -
హైదరాబాద్ : సామ్సంగ్ ఇండియా కొత్తగా గెలాక్సీ ఎ17 5జిని విడుదల చేసింది. దీనిని సోమవారం హైదరాబాద్లో సామ్సింగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ ఆవిష్కరించారు. 6జీబీ, 128 జీబీ వేరియంట్ ధరను రూ.18,999గా, 8జిబి, 128జిబి ధరను రూ.20,499గా, 8 జీబీ, 256 జీబీ ధరను రూ.23,499గా నిర్ణయించామన్నారు. 50ఎంపి మెయిన్ కెమెరాతో అందిస్తున్నామన్నారు. ఎ సిరీస్లో ఇప్పటి వరకు 9.6 కోట్ల యూనిట్లను విక్రయించామని.. పండుగ సీజన్ ముగింపు నాటికి 10 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
- Advertisement -