- Advertisement -
నవతెలంగాణ- మిడ్జిల్
ప్రభుత్వ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను మండలంలోని కొత్తపల్లి వాగు నుండి బుధవారం సాయంత్రం తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేట్ మండలం ఆర్సి తండాకు చెందిన టాక్టర్గా గుర్తించి యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నుండి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై ఇసుక మాఫియాను హెచ్చరించారు.
- Advertisement -



