- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎస్గా ఉన్న శాంతికుమారి ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో కె. రామకృష్ణారావు నియమితులైన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పోస్టులో సందీప్కుమార్ను సర్కార్ నియమించింది.
- Advertisement -