- Advertisement -
హైదరాబాద్: భారత ఆరోగ్య సంరక్షణ రంగ ప్రతినిధుల సంస్థ నాట్హెల్త్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. హైదరాబాద్లో జరిగిన 12వ వార్షిక ఆరోగ్య భారత్ సమ్మిట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. హిమాన్షు బైద్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. నివారణ వైద్యం ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేస్తామని డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -



