- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలనే నేపథ్యంలో మండలంలోని మల్లారం గ్రామంలో సర్పంచ్ మేకల రాజయ్య ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా పారిశుధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని పలు వార్డుల్లోని డ్రైనేజీల్లో చెత్త, చెదారం జీపీ సిబ్బందితో తొలగించారు. అంతర్గరోడ్లను శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



