– జ్వరం పీడితులు ను పరామర్శించిన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని విషజ్వరాలు సోకిన పాతరెడ్డిగూడెం ను మంగళవారం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. పారిశుధ్యం పనులను వినాయక పురం వైద్యాధికారి డాక్టర్ రాందాస్ తో కలిసి పారిశుధ్యం పనులను పరిశీలించారు. అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో దైర్యం చెప్పారు. కాలేయ సంబంధ వ్యాధితో ఒకరు, దమ్మపేట మండలం పూచుకంట వాసి ఒకరు ఈ గ్రామంలో చనిపోవడంతో స్థానికులు విషజ్వరాలు గా భయానికి లోనయ్యారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలలో బాగంగా ప్రతీ ఇంటి వద్ద మురుగు నీరు,చెత్త శుభ్రం చేయించారు. వినాయక పురం వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపు నిర్వహించారని ఆయన తెలిపారు. మురికి కాలువలలో ఆయిల్ బాల్స్ వేయించామని బ్లీచింగ్ పౌడర్, చల్లించామని, బుధవారం కూడా అవగాహన మనోధైర్యం కల్పించడానికి వైద్యశిబిరం నిర్వహిస్తామని తెలిపారు.
పాతరెడ్డిగూడెం లో పారిశుధ్యం పనులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES