- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : మున్సిపాల్టీ పరిధిలో ప్రతీ కార్యాలయం,పాఠశాలల్లో మొక్కలు నాటాలని కమీషనర్ బి.నాగరాజు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ లో భాగంగా పలు కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలల్లో మునగ,కరివేపాకు,సీజనల్ కూర మొక్కలు నాటాలని,కార్యాలయాల్లో ఫలాలు ఇచ్చే ఉద్యాన మొక్కలు,నీడను ఇచ్చే ఔషధ మొక్కలు నాటాలని తెలిపారు. ఆయన వెంట మున్సిపాల్టీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -