– జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగుల మురళి గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
రవీంద్రభారతిలో ఆదివారం జరిగె సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 375 వ జయంతి ఉత్సవాలకు గౌడ కులస్తులు అధిక సంఖ్యలో తరలి రావాలనీ జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగుల మురళి గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రవీంద్రభారతిలో జై గౌడ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు గౌడ కులస్తులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆ బహుజన మహనీయుని జయంతిని కనులపండుగ గా నిర్వహించడం జరుగుతుందన్నారు. జై గోడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలను 18 వ సారి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్దా గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, నందివాడ ప్రశాంత్ గౌడ్, రాజంపేట దేవేందర్ గౌడ్ తాటిపాముల భూపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.