- Advertisement -
నవతెలంగాణ  – రాజన్న సిరిసిల్ల
సర్దార్ వల్లభాయ్ పటేల్  150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు రవి, నాగేశ్వరరావు,ఆర్.ఐ లు రమేష్, మధుకర్ , యాదగిరి,ఎస్.ఐ లు కిరణ్ కుమార్, సాయి కిరణ్, శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    